ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

train accident: గూడ్స్ రైలును ఢీకొన్న ప్యాసింజర్ రైలు...53మందికి గాయాలు

ABN, First Publish Date - 2022-08-17T15:17:31+05:30

గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటన బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని (Maharashtra)గోండియా(Gondia) నగర సమీపంలో జరిగింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోండియా(మహారాష్ట్ర): గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటన బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని (Maharashtra)గోండియా(Gondia) నగర సమీపంలో జరిగింది. సిగ్నల్ తప్పిదం వల్ల భగత్ కి కోఠి ప్యాసింజర్ రైలు ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది.(train accident) ఈ ఘటనలో మూడు ప్యాసింజర్ బోగీలు పట్టాలు (three bogies of train derail)తప్పాయి.(train derail) ఈ దుర్ఘటనలో 53 మంది రైలు ప్రయాణికులు గాయపడ్డారు. గోండియా రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు మూడు రైలు బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు చెప్పారు.(collided with a goods train) 


ఈ ప్రమాదంలో గాయపడిన 53 మందిని గోండియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. రాయపూర్ నుంచి నాగపూర్ కు ప్యాసింజర్ రైలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఒకే రైలు పట్టాలపై రైళ్లు ఎదురెదురు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్పారు. రైల్వే ఉన్నతాధికారులు, సాంకేతిక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి సహాయ పునరావాస పనులు చేపట్టారు. 

Updated Date - 2022-08-17T15:17:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising