ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి

ABN, First Publish Date - 2022-03-01T13:42:17+05:30

మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌ పదవులకు సంబం ధించిన పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. శివగంగ జిల్లా దేవకోట మున్సి పాలిటీకి ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                           - Madras highcourt


ప్యారీస్‌(చెన్నై): మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌ పదవులకు సంబం ధించిన పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. శివగంగ జిల్లా దేవకోట మున్సి పాలిటీకి ఈ నెల 19న జరిగిన ఎన్నికల్లో గెలిచిన సుందరలింగం సహా 15 మంది అన్నాడీఎంకే కౌన్సిలర్లు, మార్చి 4న జరుగనున్న పరోక్ష ఎన్నికలను వాయిదావేయకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. అందులో, తమను అధికార పార్టీ వారు బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనాధ్‌ భండారీ, న్యాయమూర్తి భరత చక్రవర్తి నేతృత్వంలోని ప్రథమ ధర్మాసనం విచారణ చేపట్టింది. పరోక్ష ఎన్నికల ప్రక్రియను సీసీ కెమెరాలో రికార్డు చేయడంతో పాటు అవసరమైన పోలీసు భద్రతను కల్పిస్తామని, పరోక్ష ఎన్నికలు వాయిదావేసే ఉద్ధేశం లేదని ఎన్నికల కమిషన్‌ తరఫున హాజరైన న్యాయవాది  వివరించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని ఈసీకి స్పష్టం చేసింది.

Updated Date - 2022-03-01T13:42:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising