ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Municipal polls: భారీ భద్రత మధ్య Madhya pradesh లో తుది విడత పోలింగ్

ABN, First Publish Date - 2022-07-13T19:34:01+05:30

మధ్యప్రదేశ్ మునిసిపల్ ఎన్నికల తుది విడత పోలింగ్ బుధవారంనాడు భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: మధ్యప్రదేశ్ మునిసిపల్ ఎన్నికల (Municipal polls) తుది విడత పోలింగ్ బుధవారంనాడు భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య చరుకుగా సాగుతోంది. 5 మున్సిపల్ కార్పొరేషన్లు, 50 మున్సిపాలిటీ కౌన్సిల్స్, 169 నగర పరిషత్‌లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండవ, తుది విడత పోలింగ్ కోసం 43 జిల్లాల్లో 6,829 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జూలై 6న తొలి విడత పోలింగ్ జరిగింది. ఈనెల 17, 18 తేదీల్లో ఫలితాలు వెలువడతాయి.


మొదట విడత పోలింగ్‌లో 61 శాతం ఓటింగ్ నమోదు కాగా, రత్లాం, దేవాస్, అగర్ మాల్వాలో 80 శాతం, భోపాల్‌లో 51 శాతం, ఇండోర్‌లో 76 శాతం, ఉజ్జయినిలో 76.60 శాతం ఓటింగ్ నమోదైంది. భోపాల్‌లో తక్కువ శాతం ఓటింగ్ నమోదు కావడంపై మధ్యప్రదేశ్ బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బూత్ స్థాయి అధికారులు వోటర్ స్లిప్‌లు చాలా నిదానంగా ఇవ్వడం వల్ల అనేక మంది తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని ఆరోపించింది. దీనిపై బీజేపీ ఆఫీస్ బేరర్ల ప్రతినిధులు జూలై 7న ఎస్‌ఈసీ కమిషనర్ బసంత్ ప్రతాప్ సింగ్‌ను కలిసి తమ అసంతృప్తిని తెలియజేశారు. ఒక మెమొరాండం సమర్పించారు.


Updated Date - 2022-07-13T19:34:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising