Accident Compensation : యాక్సిడెంట్లో మరణించిన మహిళ కుటుంబానికి రూ.1 కోటి నష్టపరిహారం!
ABN, First Publish Date - 2022-07-31T00:24:45+05:30
యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన మహిళ (36) కుటుంబానికి
కొజిక్కోడ్ (కేరళ) : యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన మహిళ (36) కుటుంబానికి రూ.1 కోటి నష్టపరిహారం ప్రకటిస్తూ కొజిక్కోడ్లోని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రైబ్యునల్ (MACT) తీర్పు చెప్పింది. MACT జడ్జి కే రామకృష్ణన్ (Judge K Ramakrishnan) ఈ తీర్పు చెప్పారు.
ఓ పాఠశాలలో టీచర్గా పని చేసిన వీవీ బబిత (V V Babitha) 2019 డిసెంబరు 31న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె కుటుంబానికి రూ.80,84,900 నష్టపరిహారంగానూ, దీనిపై సంవత్సరానికి 9 శాతం వడ్డీని చెల్లించాలని ట్రైబ్యునల్ తీర్పు చెప్పింది. వడ్డీ రూ.21,15,100గా వెల్లడైంది. మృతురాలి భర్త, ఆమె తల్లి, ఆమెకుగల ఇద్దరు కుమార్తెలకు ఈ సొమ్మును సమానంగా పంపిణీ చేయాలని తెలిపింది.
Updated Date - 2022-07-31T00:24:45+05:30 IST