సుదీర్ఘకాలం తర్వాత.. భారీగా Covid కేసులు నమోదు
ABN, First Publish Date - 2022-06-30T16:12:30+05:30
రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత వెయ్యికిపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించిన బులెటిన్ ప్రకారం 1249
- 1,249 మందికి పాజిటివ్
బెంగళూరు, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత వెయ్యికిపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించిన బులెటిన్ ప్రకారం 1249 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులోనే 1109 మంది ఉన్నారు. మైసూరు 31, దక్షిణకన్నడ 29, ధారవాడ 13, బళ్లారి 12, ఇతర జిల్లాల్లో పదిలోపు నమోదయ్యాయి. 1154 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో బెంగళూరులో ఒకరు, చిక్కమగళూరులో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం 5,707 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 5,393 మంది ఉన్నారు.
Updated Date - 2022-06-30T16:12:30+05:30 IST