ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే

ABN, First Publish Date - 2022-04-04T08:23:27+05:30

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: భారత ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: భారత ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే స్థానంలో మనోజ్‌ పాండే చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. జనరల్‌ నరవణే తర్వాత ఆర్మీ వైస్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పాండేనే అత్యంత సీనియర్‌గా ఉన్నారు. కాగా జనరల్‌ నరవణే తదుపరి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత డిసెంబరులో హెలికాప్టర్‌ కూలిన ఘటనలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులికా, పన్నెండు మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా గత మూడు నెలల్లో కొంత మంది ఉన్నతాధికారులు పదవీ విరమణ పొందిన నేపథ్యంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే అత్యంత సీనియర్‌గా ఉన్నారు.  లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజ్‌ శుక్లా (ఏఆర్‌టీఆర్‌ఏసీ) మార్చి 31న రిటైరయ్యారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ సీపీ మొహంతీ, లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషీలు జనవరి 31 పదవీ విరమణ చేశారు. 


Updated Date - 2022-04-04T08:23:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising