ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లతా మంగేష్కర్ అన్ని తరాల వారికీ మాధుర్యాన్ని పంచారు : అమిత్ షా

ABN, First Publish Date - 2022-02-06T18:11:44+05:30

లతా మంగేష్కర్ మృతి పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ‘భారత రత్న’ లతా మంగేష్కర్ మృతి పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర సంతాపం తెలిపారు. ఆదివారం ఆయన ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా అన్ని తరాలవారినీ ఆమె తన అద్భుత గళంతో మంత్రముగ్ధులను చేశారన్నారు. 


‘‘లతా దీదీ మంత్రముగ్ధులను చేసే తన మధుర గళంతో భారత దేశంలో మాత్రమే కాకుండా యావత్తు ప్రపంచంలోనూ అన్ని తరాలవారి జీవితాల్లోనూ భారతీయ సంగీతపు మాధుర్యాన్ని నింపారు. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన కృషిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. ఆమె మరణం నాకు వ్యక్తిగతంగా తీరని నష్టం’’ అని చెప్పారు. 


ఎప్పటికప్పుడు ఆమె ఆప్యాయతను, ఆశీర్వాదాలను పొందడం తన అదృష్టమని చెప్పారు. సాటిలేని దేశభక్తి, తీయని మాటలు, సౌమ్యతగల ఆమె మన మధ్య ఎల్లప్పుడూ ఉంటారన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అసంఖ్యాకంగా ఉన్న ఆమె అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘ఓం శాంతి’’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2022-02-06T18:11:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising