ఆయన వ్యాఖ్యలపై స్పందించేటంతటి శక్తివంతుడిని కాను
ABN, First Publish Date - 2022-06-09T18:17:58+05:30
జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి వ్యాఖ్యలపై స్పందించి సమాధానం చెప్పేటంతటి శక్తివంతుడిని కానంటూ కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్
- Kpcc President Dk Shivakumar
బెంగళూరు, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి వ్యాఖ్యలపై స్పందించి సమాధానం చెప్పేటంతటి శక్తివంతుడిని కానంటూ కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పేర్కొన్నారు. బుధవారం సదాశివనగర్లోని తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ జేడీఎ్సతో మైత్రికి స్పందించి తాను ఒక్కడినే ఏమీ మాట్లాడలేనన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ఏదైనా ఉండవచ్చునని, పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. కుమారస్వామి వ్యాఖ్యలకు వెంటనే స్పందించి సమాధానం చెప్పేంత శక్తి లేదంటూ ఎద్దేవా చేశారు. సెక్యులరిజం కారణంగానే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని జేడీఎస్ ను కోరారన్నారు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని, ఆ విషయాన్ని తాను అంగీకరిస్తానన్నారు.
Updated Date - 2022-06-09T18:17:58+05:30 IST