ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DK Shivakumar: రాహుల్‌ టీ షర్టే కాదు.. ప్యాంటు గురించీ మాట్లాడుకోండి

ABN, First Publish Date - 2022-09-11T17:56:14+05:30

బీజేపీ ఇనుప కత్తెరతో భారత్‌ను ముక్కలు చేస్తోందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(DK Sivakumar) మండిపడ్డారు. శనివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బీజేపీ పాలనలో దేశం ముక్కలు

- కేపీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్‌


బెంగళూరు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఇనుప కత్తెరతో భారత్‌ను ముక్కలు చేస్తోందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(DK Shivakumar) మండిపడ్డారు. శనివారం కేపీసీసీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ధరించిన టీ షర్టు మాత్రమే కాదని ప్యాంటు, అండర్‌వేర్‌, నిద్రించే గది గురించి కూడా మాట్లాడుకోండి అంటూ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ భారత్‌ను ముక్కలు చేస్తోందని, తాము ఒక్కటి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. రాహుల్‌గాంధీ పదిలక్షల సూట్‌ వేసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తాను రోలెక్స్‌ వాచీ ధరించానని, తన సొమ్ముతోనే కొనుగోలు చేశానని చెప్పారు. రాహుల్‌ ఐరన్‌ లెగ్‌ అంటూ బీజేపీ ఆరోపణలపైనా తీవ్రంగా స్పందించారు. ఐరన్‌ను ఎవరు ఏవిధంగానైనా ఉపయోగించుకోవచ్చునని ఫలితం ముఖ్యమన్నారు. బీజేపీ నేతలు మూడేళ్లుగా జనం చెంతకు వెళ్లలేదని ఇప్పుడు జనస్పందన పేరుతో సభ జరుపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇదే సందర్భంగా యూత్‌ కాంగ్రెస్‌ ఉద్యోగ సృష్టి వెబ్‌సైట్‌ను, మహిళా కాంగ్రెస్‌ ఎస్‌టీఆర్‌ఈఈ పేరుతో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను ఆయన ప్రారంభించారు.



Updated Date - 2022-09-11T17:56:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising