ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ

ABN, First Publish Date - 2022-04-16T18:03:26+05:30

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరగనుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి వెల్లడించారు. విజయపురలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి వెల్లడి 


బెంగళూరు: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరగనుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి వెల్లడించారు. విజయపురలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నాయకత్వ మార్పు ప్రశ్నే లేదన్నారు. ఇలాంటి వదంతులపై తాను వ్యాఖ్యానించబోనన్నారు. ముఖ్యమంత్రి బొమ్మై నాయకత్వంలోనే 2023 శాసనసభ ఎన్నికల్లో అభివృద్ధి అజెండాతోనే ప్రజాకోర్టుకు వెళతామన్నారు. ఇప్పటికే కేబినెట్‌లో ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీతోపాటు మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. ఇందుకు సంబంధించి హైకమాండ్‌తో ముఖ్యమంత్రి మ రో విడత సమాలోచనలు జరుపుతారన్నారు. కాంట్రాక్టర్‌ సంతోష్ పాటిల్‌ ఆత్మహత్య వెనుక పెద్ద కుట్ర ఉందని, సమగ్ర తనిఖీ జరిగితే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. రాష్ట్ర బీజేపీలో ఎ లాంటి సంక్షోభం, సమస్యలు లేవన్నారు. 

Updated Date - 2022-04-16T18:03:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising