పార్టీ నేతలతో Kamal చర్చలు
ABN, First Publish Date - 2022-02-02T15:37:24+05:30
మక్కల్నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్ పార్టీ నాయకులతో మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల వ్యూహరచన, ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఈ
- చెన్నైలో 160 మంది అభ్యర్థులు
చెన్నై: మక్కల్నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్ పార్టీ నాయకులతో మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల వ్యూహరచన, ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు మౌర్యా, సెంథిల్ ఆరుముగం, శివఇలంగో తదితరులు పాల్గొన్నారు. అదే సమయంలో చెన్నై కార్పొరేషన్లో పోటీ చేయనున్న 23 అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇప్పటివరకూ కార్పొరేషన్లో పోటీకి మొత్తం 160 మంది అభ్యర్థుల పేర్లను ఆయన వెల్లడించారు.
Updated Date - 2022-02-02T15:37:24+05:30 IST