ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

13 నుంచి ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్లు

ABN, First Publish Date - 2022-05-29T15:31:25+05:30

వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పాఠశాలలు ప్రారంభించిన అనంతరం ప్రారంభమవుతాయని ప్రకటన వెలువడింది. ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పాఠశాలలు ప్రారంభించిన అనంతరం ప్రారంభమవుతాయని ప్రకటన వెలువడింది. ఆ ప్రకారం, ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 11వ తరగతి వరకు విద్యార్థుల అడ్మిషన్లు జూన్‌ 13 నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం జూన్‌ 13న అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 1 నుంచి టెన్త్‌ వరకు జూన్‌ 13 నుంచి, 12వ తరగతి విద్యార్థులకు 20న, 11వ తరగతి విద్యార్థులకు 27వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి 1,6,9,11 తరగతుల్లో విద్యార్థుల అడ్మిషన్లు 12వ తేదీ నుంచి జరుగనున్నాయి. అలాగే, మిగిలిన 2,3,4,7,8,10 తరగతుల అడ్మిషన్లు కూడా ఆరోజు నుంచే ప్రారంభం కానున్నాయి. ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే అడ్మిషన్‌ ప్రక్రియ చేపట్టిన తరుణంలో ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్లు మాత్రం ఆలస్యం కానున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అధికంగా విద్యార్థులు చేరే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-05-29T15:31:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising