తీర్పు వచ్చిన తర్వాతే పరిహారం
ABN, First Publish Date - 2022-08-06T06:47:45+05:30
ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు తీర్పు వచ్చిన తరువాతనే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని
అట్రాసిటీ చట్టంపై అలహాబాద్ హైకోర్టు తీర్పు
లఖ్నవూ, ఆగస్టు 5: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు తీర్పు వచ్చిన తరువాతనే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు లఖ్నవూ బెంచ్ స్పష్టం చేసింది. కేసు నమోదు చేసిన వెంటనేగానీ, అభియోగపత్రం సమర్పించిన తరువాతగానీ ఇవ్వకూడదని తెలిపింది. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్న జస్టిస్ దినేశ్ కుమార్ సింగ్ ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
Updated Date - 2022-08-06T06:47:45+05:30 IST