ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఎంఎం బ్లాక్ ప్రెసిడెంట్‌ను కాల్చిచంపిన అగంతకులు

ABN, First Publish Date - 2022-04-24T20:44:25+05:30

జార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) బ్లాక్ ప్రెసిడెంట్‌ దిలేశ్వర్ ఖాన్‌ను గుర్తుతెలియని దుండగులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లతెహార్: జార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) బ్లాక్ ప్రెసిడెంట్‌ దిలేశ్వర్ ఖాన్‌ను గుర్తుతెలియని దుండగులు ఆదివారం ఉదయం కాల్చిచంపారు. లతెహార్ జిల్లాలో ని కుసుమహి రైల్వే సైడింగ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జేఎంఎం బాలూమాథ్ బ్లాక్ ప్రెసిడెంట్‌గా దిలేశ్వర్ ఖాన్ ఉన్నారు. 


పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై వచ్చి రైల్వే సెండింగ్ వద్ద ఖాన్‌పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను లతెహార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. దుండగుల కోసం గాలిస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా వారిని పట్టుకుంటామని బాలూమాథ్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి అజిత్ కుమార్ తెలిపారు. కాగా, సమాచారం తెలిసిన వెంటనే జేఎంఎం లతెహార్ ఎమ్మెల్యే బైద్యనాథ్ రామ్ హుటాహుటిన తన సహచరులతో కలిసి సదర్ ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసుల  బాధ్యతారాహిత్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు. ఆగ్రహించిన గ్రామస్థులు రాంచీ-ఛాత్ర రోడ్డును దిగ్బంధం చేశారు. దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-24T20:44:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising