ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇనుప రథం.. విద్యుదాఘాతం!

ABN, First Publish Date - 2022-05-29T08:28:12+05:30

రాములోరి ఉత్సవాలను నిర్వహించిన అనంతరం రథాన్ని గదిలోకి చేర్చుతుండటం ప్రాణాలే తీసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాగుతుండగా కరెంట్‌ వైర్లకు తగిలిన వైనం

ముగ్గురి మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు

నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో విషాదం

దేవరకొండ, మే 28: రాములోరి ఉత్సవాలను నిర్వహించిన అనంతరం రథాన్ని గదిలోకి చేర్చుతుండటం ప్రాణాలే తీసింది. రథం ఇనుముతో చేసింది కావడం.. అది పైన విద్యుత్తు వైర్లకు తగలడంతో దాన్ని లాగుతున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో ఈ విషాదం జరిగింది. ఆ ఊర్లో ఏప్రిల్‌ నెలలో సీతారామ కల్యాణ మహోత్సవం నిర్వహించారు. అయితే రథాన్ని గుట్టపై ఉన్న ఆలయం వద్దే వదిలేశారు. ఆలయ కమిటీ నిర్వాహకుడు, గ్రామానికి చెందిన పసునూరి దయానందరెడ్డి, ఆ రథాన్ని గుట్టకింద ఉన్న గదిలో భద్రపరచాలని సూచించాడు. శనివారం గ్రామస్థుల్లో కొందరు తాళ్ల సాయంతో, ఇంకొందరు నేరుగా రథాన్ని చేతులతో పట్టుకొని లాగారు. ఈ క్రమంలో రథం.. పైన 11కేవీ సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్తు వైర్లకు తగలడంతో విద్యుత్తు సరఫరా అయింది. రథాన్ని లాగుతున్న వారిలో గ్రామానికి చెందిన రాజబోయిన యాదయ్య(35), పొగాకు మోహనయ్య(42), గుర్రంపోడు మండలం మక్కపల్లి గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు(28) విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. వీరివెంట ఉన్న రాజబోయిన వెంకటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వెంకటయ్యను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కాగా గ్రామానికి చెందిన దాసరి సత్తయ్య, బక్క చిన్నయ్య, విఘ్నేష్‌, రాజబోయిన మల్లయ్య, వెంకటయ్య.. రథాన్ని తాళ్లతో లాగడంతో ప్రాణాలతో బయటపడ్డారు.  

Updated Date - 2022-05-29T08:28:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising