ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Coast Guard: 9 మంది జాలర్లను కాపాడిన కోస్ట్‌గార్డ్‌

ABN, First Publish Date - 2022-10-01T16:02:31+05:30

శ్రీలంక సముద్ర జలాల్లో ఇంజిన్‌ పనిచేయక పడవలో చిక్కు కున్న పూంపుహార్‌ ప్రాంతానికి చెందిన తొమ్మిది మంది జాలర్లను భారత నావికాదళం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): శ్రీలంక సముద్ర జలాల్లో ఇంజిన్‌ పనిచేయక పడవలో చిక్కు కున్న పూంపుహార్‌ ప్రాంతానికి చెందిన తొమ్మిది మంది జాలర్లను భారత నావికాదళం కాపాడి తీరానికి చేర్చింది. మైలాడుదురై పూంపుహార్‌ రేవు నుంచి ఈ నెల 25న మరపడవలో 16 మంది జాలర్ల చేపలవేటకు వెళ్ళారు. కోడియక్కరైకి ఆగ్నేయంగా సముద్రంలో ఆ జాలర్లు చేపలుపడుతుండగా పడవలోని ఇంజిన్‌ పనిచేయక మొరాయించింది. దీంతో ఆ పడవలో ఉన్న ఏడుగురు జాలర్లు మరో నాటుపడవలో స్వస్థలానికి బయలుదేరారు. తక్కిన తొమ్మిదిమంది ఆ పడవలో కొట్టుమిట్టాడారు. పెనుగాలులకు ఆ పడవ శ్రీలంక తీరం వైపు వెళ్లడంతో ఆ దేశ నావికాదళం భారత నావికాదళానికి సమాచారం అందించింది. దీంతో భారత కోస్టుగార్డు(Indian Coast Guard) సిబ్బంది గస్తీ నౌకతో ఆ ప్రాంతానికి వెళ్ళి పడవలో ఉన్న తొమ్మిదిమంది జాలర్లను సురక్షితంగా పూంపుహార్‌ తీరానికి చేర్చారు. మూడు రోజులు ఇబ్బందులకు గురైన జాలర్లు ఎట్టకేలకు నావికాదళం సాయంతో స్వస్థలానికి చేరటంతో వారి కుటుంబీకులంతా సంతోషించారు.


Updated Date - 2022-10-01T16:02:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising