Rahul Gandhi: అప్పుడే...భారతదేశం ప్రగతి సాధిస్తుంది
ABN, First Publish Date - 2022-09-24T22:31:50+05:30
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్, ఉత్తరాఖండ్లోని పౌరిలో చోటుచేసుకున్న ఘటనలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారంనాడు..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్(UP)లోని మొరాదాబాద్, ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని పౌరిలో చోటుచేసుకున్న ఘటనలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) శనివారంనాడు దిగ్భ్రాంతి (Shocked) వ్యక్తం చేశారు. మహిళలు సరక్షితంగా ఉన్నప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. ఉత్తరాఖండ్లోని పౌరిలో మహిళా రెసెప్షనిస్టు హత్య కేసులో బీజేపీ నేత కుమారుడు, మరో ఇద్దరు రిసార్ట్ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేయగా, మొరాదాబాద్లో ఓ మహిళ వివస్త్రగా రోడ్డుపై నడిచి వెళ్తున్న వీడియో సంచలనం సృష్టించింది. ఈ రెండు ఘటనలపై రాహుల్ శనివారంనాడు ఓ ట్వీట్లో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరినీ ఈ ఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని అన్నారు.
''భారత్ జోడో యాత్రలో భాగంగా నేను అనేక మంది ప్రతిభావంతులైన అమ్మాయిలు, మహిళలతో మాట్లాడుతున్నాను. ఒకటి మాత్రం చాలా స్పష్టం. మన దేశంలోని మహిళలు సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే దేశ ప్రగతి సాధ్యమవుతుంది'' అని రాహుల్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
Updated Date - 2022-09-24T22:31:50+05:30 IST