ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐరాస అత్యవసర సమావేశం.. ఓటింగ్‌కు భారత్‌ దూరం

ABN, First Publish Date - 2022-02-28T20:46:35+05:30

ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) అత్యవసరంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) అత్యవసరంగా సమావేశమవుతోంది. ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తూ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని ఇప్పటికే రష్యా తన వీటో అధికారంతో అడ్డుకోగా, ఇదే అంశంపై చర్చిచేందుకు 199 సభ్య దేశాలున్న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. ఈ మేరకు 15 సభ్యదేశాలు భధ్రతా మండలి ఓటింగులో పాల్గొని నిర్ణయం తీసుకోగా, భారత్ ఈ ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉంది. రష్యా సైనిక చర్చను ఖండిస్తూ భద్రతా మండలిలో చేసిన తీర్మానానికి కూడా రెండ్రోజుల క్రితం భారత్ గైర్హాజరైంది. ఐరాస 1950లో ఏర్పడిన తర్వాత అంటే గత ఏడు దశాబ్దాల్లో ఇలాంటి అసాధారణ, అత్యవసర సమావేశాలు నిర్వహించడం ఇది పదకొండవది. కాగా, ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్నప్పటికీ, బెలారస్ సరిహద్దులో చర్చలు జరపాలని మాస్క్, కీవ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది.



Updated Date - 2022-02-28T20:46:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising