కోహ్లీ సెంచరీ చేశాకే పెళ్లి చేసుకుంటా
ABN, First Publish Date - 2022-03-06T20:57:38+05:30
తాజాగా మొహాలీలో ఒక ఫ్యాన్ అయితే, కోహ్లీ సెంచరీ చేయాలని కోరుతూ ప్లకార్డు పట్టుకోవడం సంచలనం సృష్టిస్తోంది. కోహ్లీ 71వ సెంచరీ చేసేంతవరకు పెళ్లి చేసుకోను అని ఉన్న ప్లకార్డును ఒక ఫ్యాన్ తన స్నేహితులతో కలిసి మొహలీ స్టేడియంలో ప్రదర్శించాడు.
ఇండియన్ క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తన ఆటతో కోట్లాదిమంది ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు టెస్టులు, వన్డేల్లో కలిపి కోహ్లీ 70 సెంచరీలు చేశాడు. అయితే, ఈమధ్య కోహ్లీ తన స్థాయికి తగ్గట్లు ఆడటం లేదన్నది ఫ్యాన్స్ మాట. కోహ్లీ తాజా గణాంకాలు చూస్తే నిజమే అనిపించకమానదు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీ చేసి దాదాపు రెండేళ్లు దాటిపోయింది. కోహ్లీ చివరిసారిగా సెంచరీ చేసింది 2019లోనే. అప్పట్నుంచి ఫ్యాన్స్ కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూస్తున్నారు.
తాజాగా మొహాలీలో శ్రీలంకతో వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ మొదటి ఇన్నింగ్స్లో 45 పరుగులకే ఔటయ్యాడు. దీంతో ఫ్యాన్స్ కోహ్లీ సెంచరీ చేయాలంటూ కోరుతున్నారు. తాజాగా మొహాలీలో ఒక ఫ్యాన్ అయితే, కోహ్లీ సెంచరీ చేయాలని కోరుతూ ప్లకార్డు పట్టుకోవడం సంచలనం సృష్టిస్తోంది. కోహ్లీ 71వ సెంచరీ చేసేంతవరకు పెళ్లి చేసుకోను అని ఉన్న ప్లకార్డును ఒక ఫ్యాన్ తన స్నేహితులతో కలిసి మొహలీ స్టేడియంలో ప్రదర్శించాడు. మరి ఫ్యాన్స్ కోరికను దృష్టిలో పెట్టుకుని కోహ్లీ త్వరలోనే సెంచరీ చేస్తాడేమో చూడాలి.
Updated Date - 2022-03-06T20:57:38+05:30 IST