ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీ పళ్లు రాలగొడతా...పోలీసు అధికారికి Karnataka కాంగ్రెస్ ఎమ్మెల్సీ హెచ్చరిక

ABN, First Publish Date - 2022-06-16T13:17:58+05:30

కర్ణాటక రాష్ట్రంలో ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సాక్షాత్తూ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ స్థాయి అధికారిని బెదిరించిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు(కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలో ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సాక్షాత్తూ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ స్థాయి అధికారిని బెదిరించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. బెలగావి అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (ఏసీపీ) సదాశివ కట్టిమణిని కర్ణాటక కాంగ్రెస్ శాసనమండలి సభ్యుడు ప్రకాష్ హుక్కేరీ బెదిరించారు.డ్యూటీలో ఉన్న ఏసీపీ సదాశివను ‘‘నీ పళ్లు రాలగొడతా’’ అంటూ ఎమ్మెల్సీ ప్రకాష్ బెదిరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్‌తో పాటు ఇతర అనుచరులను కౌంటింగ్ బూత్‌లోకి అనుమతించక పోవడంపై ప్రకాష్ హుక్కేరీ ఈ హెచ్చరిక చేశారు.


 ఎమ్మెల్యేకు పాస్‌ లేదని, కౌంటింగ్‌ బూత్‌లోకి అనుమతిస్తే ఉల్లంఘించినట్లు అవుతుందని ఏసీపీ ఎమ్మెల్యేను, ఆమె అనుచరులను అడ్డుకున్నారు.కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ హుక్కేరి జోక్యం చేసుకుని ‘‘నీ పళ్లు విరగ్గొడతాను’’ అంటూ ఏసీపీని బెదిరించడం వీడియోలో కనిపించింది.వాయువ్య ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్సీ ప్రకాష్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పలేదు.


Updated Date - 2022-06-16T13:17:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising