హౌరా-ఢిల్లీ రైల్వే లైను పేల్చివేత...నక్సల్స్ దుశ్చర్య
ABN, First Publish Date - 2022-01-27T14:47:44+05:30
నక్సలైట్లు గురువారం హౌరా-న్యూఢిల్లీ రైల్వే లైన్ను పేల్చివేశారు...
హౌరా: నక్సలైట్లు గురువారం హౌరా-న్యూఢిల్లీ రైల్వే లైన్ను పేల్చివేశారు.జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడిహ్ జిల్లా చిచాకీ- చౌదర్యాబంధ్ రైల్వేస్టేషన్ల మధ్య రైలు ట్రాక్ ను నక్సలైట్లు పేల్చివేశారు. దీంతో హౌరా- న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే పోలీసులు రంగంలోకి దిగి పేల్చివేసిన రైల్వే లైన్ వద్దకు వచ్చారు. రైల్వే కార్మికులు, ఇంజినీరింగ్ సిబ్బంది హుటాహుటిన వచ్చి రైల్వే లైను పునరుద్ధరణ పనులు చేపట్టారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-01-27T14:47:44+05:30 IST