ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిజాబ్‌ వివాదంపై స్పందించిన నితీష్

ABN, First Publish Date - 2022-02-15T01:48:27+05:30

కర్ణాటకలో తలెత్తిన హిజాబ్ వివాదం అర్ధరహితమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: కర్ణాటకలో తలెత్తిన హిజాబ్ వివాదం అర్ధరహితమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. దీనిపై అసలు చర్చే అవసరం లేదని కొట్టివేశారు. తమ రాష్ట్రంలో ఇది ఒక అంశమే కాదని, మతపరమైన మనోభావాలను తాము గౌరవిస్తామని చెప్పారు. తరగతి గదిలో కొందరు తమ తలపై ఏదో ధరిస్తే దానికి మనం ఏం చేస్తామని ప్రశ్నించారు. దానిపై వ్యాఖ్యానించాల్సిన పని లేదని అన్నారు.


''బీహార్ స్కూళ్లలో దాదాపు విద్యార్థులంతా ఒకేరకమైన దుస్తులు ధరిస్తారు. ఎవరో ఒకరు తమ తలపై ఏదో ఒకటి ధరిస్తే దానిపై వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. అలాంటి విషయాల్లో మనం జోక్యం చేసుకోరాదు. మనం ప్రతి ఒక్కరి మతమరమైన మనోభావాలను గౌరవించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరూ సమానమే'' అని నితీష్ అన్నారు. 'జనతా కే దర్బార్ మే ముఖ్యమంత్రి' అనే పోగ్రాం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నితీష్ తాజా వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-02-15T01:48:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising