Odishaలో కుండపోత వర్షంతో విరిగిపడిన కొండచరియలు
ABN, First Publish Date - 2022-07-18T13:15:10+05:30
ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి...
గజపతి (ఒడిశా):ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి.భారీ వర్షాల కారణంగా పర్వతాల మీద నుంచి చెత్తాచెదారంతో కూడిన నీటి ప్రవాహం పెరగడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఒడిశాలోని గజపతి జిల్లాలోని గుమ్మా బ్లాక్లోని కొండ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి కుండపోత వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఒడిశా అధికారులు చెప్పారు.‘‘కుండపోత వర్షాల కారణంగా గుమ్మా బ్లాక్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పర్వతాల నుంచి చెత్తాచెదారం తెచ్చిన వరదనీటి ప్రవాహం ఉంది. దీనివల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మేం సంఘటన స్థలంలో పరిస్థితిని సమీక్షించి సహాయ చర్యలు చేపట్టాం’’ అని గుమ్మా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ భాస్కర్ చంద్ర సాహు చెప్పారు.
Updated Date - 2022-07-18T13:15:10+05:30 IST