ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi కళాశాలలో గోశాల...విద్యార్థుల నిరసన

ABN, First Publish Date - 2022-01-27T14:23:54+05:30

ఆవు ఉత్పత్తులపై పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసే నెపంతో కళాశాలలో గోశాలను ఏర్పాటు చేస్తున్నారని ఢిల్లీ యూనివర్సిటీలోని హన్స్‌రాజ్ కళాశాల విద్యార్థులు ఆరోపించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఆవు ఉత్పత్తులపై పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసే నెపంతో కళాశాలలో గోశాలను ఏర్పాటు చేస్తున్నారని ఢిల్లీ యూనివర్సిటీలోని హన్స్‌రాజ్ కళాశాల విద్యార్థులు ఆరోపించారు. కళాశాలలో గోశాల ఏర్పాటుకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేశారు. హన్స్ రాజ్ కళాశాల ఆవరణలో స్వామి దయానంద్ గోసంరక్షణ, పరిశోధనా కేంద్రం పేరుతో కళాశాల అధికారులు గోశాల ఏర్పాటు చేశారు. గోశాల ఏర్పాటు చేసిన స్థలం మహిళా హాస్టల్‌ కోసం రిజర్వ్‌ చేసిందని విద్యార్థులు పేర్కొన్నారు.కాగా కాలేజీ ప్రిన్సిపాల్ రామశర్మ గోశాల ఆరోపణలను తోసిపుచ్చారు. కళాశాల క్యాంపస్‌లో గోశాల కోసం స్థలం లేదని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థులు చెప్పారు.మహిళా హాస్టల్ కోసం కేటాయించిన స్థలంలోనే స్వామి దయానంద్ గోసంరక్షణ, పరిశోధనా కేంద్రం పేరిట గోశాల నిర్మాణాన్ని హంసరాజ్ కళాశాల విద్యార్థులు వ్యతిరేకించారు. 


Updated Date - 2022-01-27T14:23:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising