విక్టోరియాలో Governarకు బూస్టర్ డోస్
ABN, First Publish Date - 2022-01-15T16:17:38+05:30
రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ నగరంలోని విక్టోరియా ఆసుపత్రిలో కొవిడ్ బూస్టర్డోసు పొందారు. శుక్రవారం గవర్నర్ విక్టోరియా ఆసుపత్రికి చేరుకోగా డైరెక్టర్ సహా వైద్యాధికారులు స్వాగతించారు. బూస్టర్ డోస్ వేసుకున్న తర్వాత గవర్నర్ మీడియాతో
బెంగళూరు: రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ నగరంలోని విక్టోరియా ఆసుపత్రిలో కొవిడ్ బూస్టర్డోసు పొందారు. శుక్రవారం గవర్నర్ విక్టోరియా ఆసుపత్రికి చేరుకోగా డైరెక్టర్ సహా వైద్యాధికారులు స్వాగతించారు. బూస్టర్ డోస్ వేసుకున్న తర్వాత గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బూస్టర్డోస్ ప్రక్రియ ఆరంభమైందన్నారు. ఎవరెవరు డోసుకు అర్హులో వారంతా వెంటనే తప్పనిసరిగా వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే కర్ణాటక ముందంజలో ఉందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ మూడోవిడత కేసులు పెరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గవర్నర్ వెంట రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ సుధాకర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
Updated Date - 2022-01-15T16:17:38+05:30 IST