ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fresh Water: గాలిలోని తేమనుంచి నీరు

ABN, First Publish Date - 2022-07-27T13:49:04+05:30

గాలిలోని తేమ నుంచి మంచినీటిని ఉత్పత్తి చేసే యంత్రాన్ని(the machine) మైలాపూర్‌ కపాలీశ్వరాలయంలో ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం రాష్ట్ర దేవాదాయ శాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మైలాపూరు కపాలీశ్వరాలయంలో యంత్రం ఏర్పాటు

- ప్రారంభించిన మంత్రి శేఖర్‌బాబు


చెన్నై, జూలై 26 (ఆంధ్రజ్యోతి): గాలిలోని తేమ నుంచి మంచినీటిని ఉత్పత్తి చేసే యంత్రాన్ని(the machine) మైలాపూర్‌ కపాలీశ్వరాలయంలో ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu) రూ.18లక్షల విలువైన యంత్రపరికరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ శాఖ ఉన్నతస్థాయి సలహామండలి సభ్యులైన మల్లిఖార్జునన్‌, సంతాన కృష్ణన్‌ సంయుక్తంగా గాలిలోని తేమతో మంచినీటిని ఉత్పత్తి చేసే పరికరాన్ని ఏర్పాటు చేయడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ పరికరం ద్వారా ఆలయానికి వచ్చే భక్తులకు పరిశుభ్రమైన మంచినీరు(fresh water) లభిస్తుందన్నారు. ఈ పరికరం గాలిలోని తేమను స్వీకరించి పరిశుభ్రమైన నీటిని అందిస్తుందన్నారు. ఈ యంత్రం రోజుకు 500 లీటర్ల వరకు మంచినీటిని అందించగలదని తెలిపారు. ప్యారీస్‌ కార్నర్‌లో ఉన్న కాళికాంబాళ్‌ ఆలయంలో కూడా ఇలాంటి యంత్రాన్ని ఏర్పాటు చేస్తామని మల్లిఖార్జునన్‌(Mallikarjunan) హామీ ఇచ్చారని మంత్రి శేఖర్‌బాబు చెప్పారు. రెండు ఆలయాల్లో ఈ యంత్రం పనితీరు పరిశీలించిన తరువాత దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని సుప్రసిద్ధ ఆలయాల్లో ఈ పరికరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక చిదంబరం ఆలయంలోని నగలను లెక్కించేందుకు ఆగస్టు రెండో వారంలో ఓ తేదీ ప్రకటిస్తామని, ఆ రోజు దేవాదాయ శాఖ అధికారులు వచ్చి వాటిని పరిశీలించవచ్చునని దీక్షితార్లు తెలియజేశారని మంత్రి చెప్పారు. 

Updated Date - 2022-07-27T13:49:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising