ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Haryana గ్రామంలో కొండచరియలు విరిగిపడి నలుగురు బాలికల మృతి

ABN, First Publish Date - 2022-01-11T15:00:07+05:30

హర్యానా రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో నలుగురు బాలికలు సజీవ సమాధి అయ్యారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేవట్ (హర్యానా): హర్యానా రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో నలుగురు బాలికలు సజీవ సమాధి అయ్యారు. మేవట్ పట్టణ సమీపంలోని కంగర్కా గ్రామానికి చెందిన నలుగురు బాలికలు ఇళ్ల కోసం మట్టిని తీసుకురావడం కోసం వెళ్లారు. మట్టి తవ్వుతుండగా ఆకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు బాలికలు మరణించారు. గ్రామస్థులు హుటాహుటిన తరలివచ్చి బాలికల మృతదేహాలను వెలికితీశారు.మృతుల్లో బాలికలు వకీలా(19), జానిస్తా(18), తస్లీమా(10), గులాప్షా(9)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సోఫియా అనే మరో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-01-11T15:00:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising