ప్రధాని మోదీ దీర్ఘాయష్షు కోసం
ABN, First Publish Date - 2022-01-18T09:35:15+05:30
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీర్ఘాయుష్షుతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని
ధర్మస్థళలో మహామృత్యుంజయ హోమం
బెంగళూరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీర్ఘాయుష్షుతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కర్ణాటక రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థళ మంజునాథస్వామి సన్నిధిలో మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. సోమవారం జరిగిన హోమంలో వందలాది మంది రుత్వికులు భాగస్వాములయ్యారు. బెళ్తంగడి బీజేపీ ఎమ్మెల్యే హరీష్ పూంజ నేతృత్వంలో ధర్మస్థళ ధర్మాధికారి డాక్టర్ వీరేంద్రహెగ్డే ఆశీస్సులతో హోమాలు జరిగాయి. వేదమూర్తి నాగేంద్ర భరధ్వాజ సూరత్కల్ ప్రధాన పౌరోహిత్యంలో శృంగేరి, బెంగళూరు, మైసూరుతో పాటు కేరళ రాష్ట్రం కాసరగోడు సహా ఏడుగురు ఆచార్యులతో పాటు 130 మంది రుత్వికులు, 1008 ఆహుతులతో మహా మృత్యుంజయ హోమం జరిపించారు. పూర్ణాహుతి వేళ మంత్రులు ఈశ్వరప్ప, సీసీ పాటిల్ సహా పలువురు బీజేపీ ముఖ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-18T09:35:15+05:30 IST