ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

ABN, First Publish Date - 2022-01-31T19:08:03+05:30

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారంనాడు 2021-22 ఆర్థిక సర్వేను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారంనాడు 2021-22 ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసేదిగా భావించే ఈ సర్వే ఆధారంగానే ప్రతిఏటా బడ్జెట్ రూపకల్పన జరుగుతుంటుంది. కేంద్ర బడ్జెట్ మంగళవారంనాడు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దీనికి ముందుగా ''ఆర్థిక సర్వే''ను నిర్మలా సీతారామన్ లోక్‌సభకు సమర్పించారు. అనంతరం సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు సభాపతి ఓం బిర్లా ప్రకటించారు.


రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 8 నుంచి 8.8.5 శాతంగా ఉండొచ్చని ఆర్థిక శాఖ అంచనాల నేపథ్యంలో ఈ సర్వేను మంత్రి ప్రవేశపెట్టారు. సర్వే వివరాలను ఆర్థిక శాఖ ప్రత్యేక మీడియా సమావేశంలో వెల్లడించనుంది. కాగా, దీనికి ముందు, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా ప్రారంభించారు. దేశ సాధించిన ప్రగతి, పథకాలు, భవిష్యత్‌ లక్ష్యాలను తన ప్రసంగంలో రాష్ట్రపతి వివరించారు.

Updated Date - 2022-01-31T19:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising