Keralaలో ఘోర రోడ్డు ప్రమాదం..57 మంది ప్రయాణికులకు గాయాలు
ABN, First Publish Date - 2022-05-31T15:39:32+05:30
కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో సోమవారం రాత్రి రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 57 మంది ప్రయాణికులు గాయపడ్డారు...
రెండు బస్సులు ఢీకొన్నాయి...
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో సోమవారం రాత్రి రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 57 మంది ప్రయాణికులు గాయపడ్డారు.కొల్లాం రూరల్ ప్రాంతంలోని చిత్తారా పోలీస్ స్టేషన్ పరిధిలోని కులతుప్పుజ-మదతర రహదారిపై సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.ప్రమాదంలో గాయపడిన 42 మందిని తిరువనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చామని పోలీసులు చెప్పారు. స్వల్పంగా గాయపడిన 15 మందిని కడక్కల్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.వైద్య కళాశాల ఆసుపత్రిని సందర్శించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు.
గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉందని మంత్రి చెప్పారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.గాయపడిన వ్యక్తులు, వారి కుటుంబాలకు సహాయం చేయడానికి మెడికల్ కాలేజీలో కంట్రోల్ రూమ్ ప్రారంభించారు.
Updated Date - 2022-05-31T15:39:32+05:30 IST