ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూండాయిజం చేస్తే బీజేపీలో సన్మానం: ఆప్

ABN, First Publish Date - 2022-04-16T00:45:48+05:30

బీజేపీ గూండలాను పోషిస్తోంది. వారికి సన్మానాలు చేస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఇంటిపై దాడికి పాల్పడ్డ ఎనిమిది మంది గూండాలను బీజేపీ సన్మానించింది. అది కూడా బీజేపీ కార్యాలయంలో, ఢిల్లీ బీజేపీ అధినేత ఆదేశాల మేరకు జరిగింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై దాడికి పాల్పడ్డ వారికి భారతీయ జనతా పార్టీ నేతలు సన్మానం చేశారని, దీన్ని బట్టి ఆ పార్టీ విధానమేంటో స్పష్టమవుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిశి అన్నారు. గూండాయిజం, రౌడీయిజం చేయమని బీజేపీ ప్రోత్సహిస్తోందని, అలా చేసిన వారికి సన్మానాలు సైతం చేస్తోందని ఆమె విమర్శించారు. ముఖ్యమంత్రి నివాసంపైనే పట్టపగలు దాడి జరుగుతుంటే ఈ దేశంలో సామాన్య ప్రజానికం పరిస్థితి ఏంటని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ విషయమై శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో అతిశి మాట్లాడుతూ ‘‘బీజేపీ గూండలాను పోషిస్తోంది. వారికి సన్మానాలు చేస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఇంటిపై దాడికి పాల్పడ్డ ఎనిమిది మంది గూండాలను బీజేపీ సన్మానించింది. అది కూడా బీజేపీ కార్యాలయంలో, ఢిల్లీ బీజేపీ అధినేత ఆదేశాల మేరకు జరిగింది. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? ముఖ్యమంత్రి పరిస్థితే ఇలా ఉంటే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఏంటి? గూండాగిరి చేస్తే బీజేపీలో సన్మానాలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి’’ అని అన్నారు.

Updated Date - 2022-04-16T00:45:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising