ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాటాకు చప్పుళ్లకు భయపడను!

ABN, First Publish Date - 2022-06-19T14:29:25+05:30

అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌సెల్వం, ఆయన మద్దతుదారులంతా తానేదో ఘోరతప్పిదం చేసినట్లు విమర్శిస్తూ చేస్తున్న బెదిరింపులకు తాను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                           - Ex Minister Jayakumar


చెన్నై, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌సెల్వం, ఆయన మద్దతుదారులంతా తానేదో ఘోరతప్పిదం చేసినట్లు విమర్శిస్తూ చేస్తున్న బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి డి.జయకుమార్‌ స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద విలేఖరులతో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఏకనాయకత్వంపై చర్చ జరిగిందని, ఆ విషయాన్నే తాను మీడియా ముందు వెల్లడించానని చెప్పారు. అంత మాత్రానికే ఏకనాయకత్వం వివాదానికి తానే ప్రధాన కారకుడినంటూ పన్నీర్‌సెల్వం విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 23న జరుగనున్న సర్వసభ్యమండలిలో చేయాల్సిన తీర్మానాలపై తాజాగా పార్టీ సీనియర్‌ నేతలు చర్చలు జరిపారని తెలిపారు. అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం కావాలని తాను మాత్రమే కోరుకోవడం లేదని, పార్టీ శ్రేణులంతా కోరుతున్నారని చెప్పారు. ఏకనాయకత్వంపై పార్టీ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని జయకుమార్‌ చెప్పారు. 

Updated Date - 2022-06-19T14:29:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising