Karnataka మాజీ మంత్రి లలితను హతమారుస్తామంటూ బెదిరింపు లేఖ
ABN, First Publish Date - 2022-07-04T14:50:48+05:30
కర్ణాటక మాజీ మంత్రి బీటీ లలితా నాయక్కు గుర్తు తెలియని దుండగుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది...
బెంగళూరు(కర్ణాటక): కర్ణాటక మాజీ మంత్రి బీటీ లలితా నాయక్కు గుర్తు తెలియని దుండగుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది.కర్ణాటక సంస్కృతి, మహిళా శిశు సంక్షేమ శాఖ మాజీ మంత్రి బీటీ లలితా నాయక్ను హతమారుస్తామని గుర్తు తెలియని దుండగుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది.పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ), సోషల్ డెమోక్రటిక్ సంస్థలు నిర్వహించే కార్యక్రమానికి హాజరైతే లలితా ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని లేఖలో హెచ్చరించారు.
ఈ లేఖలో ఇద్దరు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్డి కుమారస్వామిల ప్రస్తావన కూడా ఉంది. వారంతా దేశ వ్యతిరేక అంశాలకు మద్ధతు ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.ఈ మేరకు సంజయ్నగర్ పోలీసులకు లలితా నాయక్ ఫిర్యాదు చేశారు. రక్తం యొక్క దృశ్య రూపాన్ని అనుకరించడానికి లేఖ ఎరుపు సిరాతో రాశారు.నాయక్కు గతంలో కూడా ఇలాంటి బెదిరింపు లేఖలు వచ్చాయి.
Updated Date - 2022-07-04T14:50:48+05:30 IST