Delhi: మాజీ ముఖ్యమంత్రికి ఢిల్లీ నుంచి పిలుపు
ABN, First Publish Date - 2022-08-27T17:55:23+05:30
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, మాజీ సీఎం యడియూరప్పను అత్యవసరంగా ఢిల్లీ రావాలని పార్టీ అధిష్టానం పెద్దలు ఆదేశించారు.
- బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ
- మరికొంత మంది కీలక నేతలతోనూ సమావేశం
బెంగళూరు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, మాజీ సీఎం యడియూరప్పను అత్యవసరంగా ఢిల్లీ రావాలని పార్టీ అధిష్టానం పెద్దలు ఆదేశించారు. శుక్రవారం సమాచారం అందిన వెంటనే యడియూరప్ప బెంగళూరు ఎయిర్పోర్టు(Yeddyurappa Bangalore Airport) నుంచి ఢిల్లీకి బయలుదేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన యడియూరప్ప రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు సమాచారం. అదే తరహాలోనే మరింతమంది కీలకనేతలతోను రాత్రి పొద్దుపోయేదాకా చర్చలు జరిపారు. రాష్ట్రప్రభుత్వంతో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పు విషయమై వాడివేడిగా చర్చలు సాగుతున్న తరుణంలో యడియూరప్పను ఢిల్లీకు పిలిపించుకోవడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఏడాది తర్వాత మరోసారి 40 శాతం కమీషన్ల అంశం తెరపైకి రావడం, రాహుల్గాంధీ ‘భారత్ జోడో’ యాత్ర కర్ణాటక(Karnataka)లో సుదీర్ఘ కాలం కొనసాగడం వంటి అంశాలపైనా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడి ప్రస్తావన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2022-08-27T17:55:23+05:30 IST