Shivaram's statement: మాజీ ముఖ్యమంత్రి హత్యకు ఆర్ఎస్ఎస్ కుట్ర
ABN, First Publish Date - 2022-08-20T17:02:20+05:30
ప్రతిపక్షనేత సిద్దరామయ్య(Siddaramaiah) హత్యకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర పన్నాయని వెనుకబడినవర్గాల జాగృతి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శివరామ్
- వెనుకబడినవర్గాల జాగృతి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శివరామ్
బెంగళూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షనేత సిద్దరామయ్య(Siddaramaiah) హత్యకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర పన్నాయని వెనుకబడినవర్గాల జాగృతి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శివరామ్ ఆరోపించారు. మైసూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్య హత్యకు కుట్ర సాగుతోందన్నారు. అందులో ట్రయల్గానే గురువారం మడికేరిలో దాడికి యత్నం జరిగిందన్నారు. గాంధీజీ తరహాలో ప్రజల మధ్యనే హత్య చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. కాగా సిద్దరామయ్య కుమారుడు, ఎమ్మెల్యే యతీంద్ర(MLA Yatindra) కూడా ఇటువంటి ఆరోపణలే చేశారు. తన తండ్రి సిద్దరామయ్యకు హిందూ సంఘాల నుంచి బెదిరింపులు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రతిపక్షనేతకు భద్రత కల్పించడమే సాధ్యం కాలేదని ఇక ప్రజలకు ఏమాత్రం రక్షణ కల్పిస్తారన్నారు. రాష్ట్రంలో మత ఘర్షణలపట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ప్రతిపక్షాల మధ్య సాగే చిన్నపాటి విమర్శలను పెద్దగా చేస్తున్నారని, అనవసరమైన గందరగోళాన్ని సృష్టిం చి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఉగ్రవాదులు కూడా దేశభక్తులను చేస్తున్నారని ఆరోపించారు.
Updated Date - 2022-08-20T17:02:20+05:30 IST