ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Former Chief Minister: ఈపీఎస్‌ పిటిషన్‌పై విచారణ మళ్ళీ వాయిదా

ABN, First Publish Date - 2022-08-24T15:55:45+05:30

అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశం చెల్లదని, ఆ పార్టీలో జంట నాయకత్వమే కొనసాగాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మాజీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశం చెల్లదని, ఆ పార్టీలో జంట నాయకత్వమే కొనసాగాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) దాఖలు చేసిన అప్పీలుపై విచారణ మళ్ళీ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ సోమవారం ఉదయం న్యాయమూర్తులు ఎం.దురైసామి(M. Duraisamy), సుందర్‌మోహన్‌ ఎదుట విచారణకు వచ్చింది. ఈపీఎస్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది విజయనారాయణన్‌ హాజరై సర్వసభ్యమండలి సమావేశానికి వ్యతిరేకంగా సింగిల్‌ జడ్జి జారీ చేసిన ఉత్తర్వు నఖలు ఇంకా అందలేదని, దాంతో నిమిత్తం లేకుండా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తులు కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. ఆ మేరకు మంగళవారం ఉదయం మళ్ళీ ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం తరఫు న్యాయవాది హాజరై ఈ కేసులో సీనియర్‌ న్యాయవాది గురుకృష్ణకుమార్‌(Senior Advocate Gurukrishna Kumar) హాజరుకానుండటంతో కాస్త గడువు ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తులు స్పందిస్తూ ఈ అప్పీలుపై మధ్యంతర ఉత్తర్వులుగానీ, స్టే గానీ జారీ చేసే అవకాశం లేదని, ఈ పరిస్థితుల్లో తుది విచారణ కోసం కేసును ఈ నెల 25కు వాయిదా వేస్తున్నామని ప్రకటించారు.

Updated Date - 2022-08-24T15:55:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising