ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kasab కు కూడా ఇంత భద్రత ఇవ్వలేదు... రెబల్ ఎమ్మెల్యేలపై Aditya Thackeray విసుర్లు

ABN, First Publish Date - 2022-07-03T20:33:29+05:30

రెబల్ శివసేన ఎమ్మెల్యేలకు ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం కల్పించిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై శివసేన నేత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: రెబల్ శివసేన ఎమ్మెల్యేలకు ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం కల్పించిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై శివసేన నేత ఆదిత్య థాకరే ఛలోక్తులు విసిరారు. కసబ్‌కు కూడా ఇంత భద్రత కల్పించలేదని అన్నారు. ఒక లగ్జరీ హోటల్‌ నుంచి భారీ బందోబస్తు మధ్య రెబల్ ఎమ్మెల్యేలను ఆదివారంనాడు విధాన్ భవన్‌కు తీసుకువచ్చారు. దీనిపై ఆదిత్య థాకరే స్పందిస్తూ, ముంబైలో ఇంతకుముందెన్నడూ ఇలాంటి భద్రతను తాము చూడలేదని, ఎందుకు అంత భయమని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక బస్సుల్లో షిండే వర్గం ఎమ్మెల్యేలను విధానసభకు తీసుకువచ్చారు. షిండే సారథ్యంలోని సేన-బీజేపీ ప్రభుత్వం ఈనెల 4వ తేదీన అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సి ఉంది.


రెండు రోజల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో షిండేకు మద్దతుగా నిలిచిన రెబల్ శివసేన ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రం గోవా నుంచి ముంబైకి ఒక చార్టెట్ విమానాంలో తిరిగివచ్చారు. గోవాకు ఉదయమే వెళ్లిన షిండే వారిని తనవెంట పెట్టుకుని వచ్చారు. చిన్నపార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి 10 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి చెందిన 106 మంది ఎమ్మెల్యేలు షిండేకు మద్దతిస్తున్నారు

Updated Date - 2022-07-03T20:33:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising