ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ షాక్‌!: చార్జీలు పెంచిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-09-11T13:30:35+05:30

డీఎంకే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ షాక్‌(Electric shock) ఇచ్చింది. ఎనిమిదేళ్ల తర్వాత విద్యుత్‌ చార్జీలు పెంచుతూ నిర్ణయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                              - తక్షణం అమలులోకి 


చెన్నై, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): డీఎంకే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ షాక్‌(Electric shock) ఇచ్చింది. ఎనిమిదేళ్ల తర్వాత విద్యుత్‌ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేగాక ఈ ఆదేశాలు శనివారం నుంచే అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది. గత పదేళ్లుగా రాష్ట్ర విద్యుత్‌ బోర్డు(State Electricity Board) అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. ఆ సంస్థ రుణభారం రూ.12647 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలను పెంచాలంటూ కేంద్ర విద్యుత్‌ నియంత్రణా మండలి ఆదేశించింది. దీంతో రాష్ట్ర విద్యుత్‌ బోర్డు చార్జీలను స్వల్పస్థాయిలో పెంచే దిశగా జాబితాను కూడా సిద్ధం చేసింది. ఆ మేరకు వినియోగదారులు ఉపయోగించే యూనిట్ల సంఖ్యను బట్టి రూ.27.50 నుంచి రూ.565 వరకు విద్యుత్‌ చార్జీల(Electricity charges)ను పెంచేందుకు పలు విడతలుగా ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టిన అనంతరం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి అమలులోకి వచ్చిన విద్యుత్‌ చార్జీల ప్రకారం రెండు నెలల వరకు 200 యూనిట్ల విద్యుత్‌ వాడితే నెలకు రూ.27.50 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఈ కేటగిరికీ చెందిన విద్యుత్‌ వినియోగదారులే అధికంగా ఉన్నారు. సుమారు 63.35 లక్షల మంది 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారు. ఇదే విధంగా 300 యూనిట్ల విద్యుత్‌ను వాడితే రూ.72.50, 400 యూనిట్లు వాడితే రూ.147.50, 500 యూనిట్లు వాడితే రూ.297.50, 600 యూనిట్లు వాడితే రూ.155, 700 యూనిట్ల విద్యుత్‌ను వాడితే రూ.275లు, 800 యూనిట్ల విద్యుత్‌ను వాడితే రూ.395లు, 900 యూనిట్లు వరకు వాడితే రూ.565లను ప్రతినెలా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంచిన విద్యుత్‌ చార్జీలు 2027 వరకూ అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.



Updated Date - 2022-09-11T13:30:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising