ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madras ఐఐటీలో మరో 18 మంది విద్యార్థులకు కొవిడ్

ABN, First Publish Date - 2022-04-22T18:07:33+05:30

తమిళనాడు రాష్ట్రంలోని మద్రాస్ ఐఐటీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం మరో 18 మంది ఐఐటీ విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై(తమిళనాడు): తమిళనాడు రాష్ట్రంలోని మద్రాస్ ఐఐటీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం మరో 18 మంది ఐఐటీ విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. గురువారం మద్రాస్ ఐఐటీలో 12మంది విద్యార్థులకు కరోనా సోకిందని తేలింది. మళ్లీ శుక్రవార పరీక్షలు చేయగా మరో 18 మందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది.ఐఐటీ క్యాంపస్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30కి పెరిగింది. ఐఐటీ హాస్టల్ లోనే కరోనా వ్యాప్తి చెందటంతో ఐఐటీ పరిపాలనాధికారులు, వైద్యాధికారులు పారిశుద్ధం మెరుగుపై దృష్టి సారించారు.ఐఐటీలో కరోనా సోకిన వారిలో 90 శాతం మందికి ఒమైక్రాన్ బీఏ 2 వేరియెంట్ అని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ చెప్పారు.శుక్రవారం ఒక్కరోజే దేశంలో 2,451 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో ప్రస్థుతం ఉన్న యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 14,241కి చేరింది. 


Updated Date - 2022-04-22T18:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising