Covid guidelines ఖచ్చితంగా పాటించండి...సమాజ్వాదీ పార్టీకి ఈసీ ఆదేశాలు
ABN, First Publish Date - 2022-01-19T15:15:14+05:30
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని...
లక్నో(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సమాజ్వాదీ పార్టీని కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) ఆదేశించింది.సమాజ్వాదీ పార్టీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల చేరిక సందర్భంగా కార్యాలయం ఆవరణలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ కార్యకర్తలు గుమిగూడిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో కొవిడ్ ఉల్లంఘనలు జరగకుండా చూసుకోవాలని ఈసీ ఆదేశించింది.సమాజ్వాదీ పార్టీ కార్యాలయం ఆవరణలో రెండువేల మందికి పైగా కార్యకర్తలు గుమిగూడిన ఘటనపై పోలీసులు కరోనా మార్గదర్శకాల ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 22వతేదీ వరకు ఎన్నికల ర్యాలీలు జరపరాదని ఈసీ ఆదేశించింది.
Updated Date - 2022-01-19T15:15:14+05:30 IST