earthquake: మయన్మార్లో భారీ భూకంపం...ఈశాన్య రాష్ట్రాల్లోనూ భూప్రకంపనలు
ABN, First Publish Date - 2022-09-30T13:10:54+05:30
బర్మా దేశంలోని మయోన్మార్(Myanmar) నగరంలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం(earthquake) సంభవించింది....
న్యూఢిల్లీ:బర్మా దేశంలోని మయోన్మార్(Myanmar) నగరంలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం(earthquake) సంభవించింది. మయోన్మార్ భూకంపం ప్రభావం వల్ల భారతదేశంలోని పలు ఈశాన్య రాష్ట్రాల్లోనూ శుక్రవారం తెల్లవారుజామున భూప్రకంపనలు వచ్చాయి. శుక్రవారం తెల్లవారుజామున 3.52 గంటలకు మయోన్మార్ నగరంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది.అసోం, మేఘాలయతోపాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లోనూ శుక్రవారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి.(northeastern states, including Assam and Meghalaya)
బర్మా(Burma)దేశంలోని మయోన్మార్ కేంద్రంగా సంభవించిన భూకంపం 140 కిలోమీటర్ల లోతులో వచ్చిందని అధికారులు చెప్పారు. గురువారం అండమాన్ నికోబార్ దీవుల్లోని(Andaman and Nicobar islands) డిజ్లీపూర్ పట్టణానికి 150 కిలోమీటర్ల దూరం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది.
Updated Date - 2022-09-30T13:10:54+05:30 IST