ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dussehra festival: దసరా కోసం 2వేల అదనపు బస్సులు

ABN, First Publish Date - 2022-09-28T17:28:13+05:30

దసరా పండుగ(Dussehra festival) నేపథ్యంలో ప్రయాణీకుల సౌకర్యార్ధం కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ) రాష్ట్రంలోని వివిధ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ(Dussehra festival) నేపథ్యంలో ప్రయాణీకుల సౌకర్యార్ధం కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ) రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు 2 వేల అదనపు బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి అక్టోబరు 3 వరకు బెంగళూరు నుంచి వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సుల సంచారం ఉం టుందని కేఎస్‌ఆర్టీసీ నగరంలో మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ధర్మస్థళ, కుక్కేసుబ్రహ్మణ్య, శృంగేరి, హొరనాడు, శివమొగ్గ, మడికేరి, మంగళూరు, దావణగెరె, గోకర్ణ, కొల్లూరు, హుబ్బళ్ళి, ధార్వాడ, బెళగావి, విజయపుర, కార్వార, బళ్ళారి, హొసపేట, కలబురగి, రాయచూరు, హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, ఊటి, కొడైకెనాల్‌, సేలం, తిరుచనాపల్లి,  పుదుక్కోట, మధురై, పణజి, శిరడి, ఎర్నాకులం, పాల్ఘాట్‌, పునాలకు ఈ ప్రత్యేక బస్సులు అందు బాటులో ఉంటాయని ప్రకటన పేర్కొంది. కాగా మైసూరు దసరా ఉత్సవాలలో ఈసారి పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉండటంతో ఆర్టీసీ మైసూరు జిల్లా కోసమే ప్రత్యేకంగా 450 బస్సులను అదనంగా నడుపనుంది. ఇందులో 200 బస్సులు ప్రతిరోజూ బెంగళూరు-మైసూరు నగరాల మధ్య సంచ రిస్తాయని ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా నలుగురు అంతకంటే ఎక్కువ మంది ప్రయాణీకులు ముందుగా తమ టికెట్లను రిజర్వుచేసుకుంటే చార్జీలో 5 శాతం ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నారు. కాగా ప్రతి ప్రయాణీకుడు రాను పోను టికెట్లను ఒకేసారి రిజర్వు చేసుకుంటే 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-28T17:28:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising