Droupadi Murdu: 25న ప్రమాణస్వీకారం
ABN, First Publish Date - 2022-07-24T19:13:56+05:30
దేశ పదిహేనవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈనెల 25న ప్రమాణస్వీకారం చేయనున్నట్టు..
న్యూఢిల్లీ: దేశ పదిహేనవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈనెల 25న ప్రమాణస్వీకారం చేయనున్నట్టు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యున్నత రాజ్యంగ పదవిని చేపడుతున్న తొలి గిరిజన మహిళగా 64 ఏళ్ల ముర్ము రికార్డులకెక్కారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉదయం 10.15 గంటలకు రాష్ట్రపతి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సెరిమోనియల్ ప్రాసెస్లో భాగంగా పదవీ విరమణ చేయనున్న రామ్నాథ్ కోవింద్, రాష్ట్రపతి పగ్గాలు చేపట్టనున్న ద్రౌపది ముర్ము కలిసి పార్లమెంటుకు విచ్చేస్తారు.
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్వీకర్ ఓం బిర్లా, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్య కార్యాలయాల రాయబారులు, పార్లమెంటు సభ్యులు, ప్రిన్సిపల్ సివిల్ అండ్ అండ్ మిటరీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
Updated Date - 2022-07-24T19:13:56+05:30 IST