రూ.1,050కి చేరిన వంట గ్యాస్ సిలెండర్
ABN, First Publish Date - 2022-07-06T22:20:38+05:30
వంట గ్యాస్ ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. తాజాగా 14.2 కిలోల సిలెండర్ ధరను..
న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. తాజాగా 14.2 కిలోల సిలెండర్ ధరను సవరించారు. బుధవారం నుంచి సిలెండర్ ధర రూ.50 పెరిగింది. దీంతో ఢిల్లీలో సిలెండర్ ధర రూ.1,053కి చేరింది. కోల్కతాలో రూ.1,079, ముంబైలో 1,053, చెన్నైలో రూ.1,068కు చేరినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. దీనికి ముందు 2022 మే 19న వంటగ్యాస్ సిలెండర్ ధరను సవరించారు.
మరోవైపు, 19 కిలోల కమర్షియల్ సిలెండర్ ధరను రూ.8.5 తగ్గించారు.బుధవారం నుంచి ఈ తగ్గింపు ధరలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలెంర్ ధర రూ.2,102.50, కోల్కతాలో రూ.2,132 ముంబైలో రూ.1,973.50, చెన్నైలో రూ.2,177.50కి చేరింది.
Updated Date - 2022-07-06T22:20:38+05:30 IST