ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీకి సిగ్గుందా? : మమత బెనర్జీ

ABN, First Publish Date - 2022-02-08T21:06:58+05:30

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి, తమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి, తమ ఓటును వృథా చేసుకోవద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ప్రజలను కోరారు. ఆమె మంగళవారం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధినేత అఖిలేశ్ యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎస్‌పీ నేతృత్వంలోని కూటమికి మద్దతు తెలిపేందుకు ఆమె ఇక్కడికి వచ్చారు. 


ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో సరైన రీతిలో వ్యవహరించలేదని మమత బెనర్జీ ఆరోపించారు. ఈ మహమ్మారి రెండో ప్రభంజనం సమయంలో యోగి పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీని ఓడించడం కోసం ప్రచారంలో తలమునకలై ఉన్నారన్నారు. కోవిడ్ వల్ల ప్రజలు ప్రాణాలను కోల్పోతూ ఉన్నపుడు మీరెక్కడున్నారని యోగిని ఉద్దేశించి ప్రశ్నించారు. 


కోవిడ్ రెండో ప్రభంజనం సమయంలో గంగా నదిలో మృతదేహాలు తేలియాడినట్లు వచ్చిన వార్తా కథనాలను ప్రస్తావిస్తూ, గంగా మాతను మనం గౌరవిస్తామన్నారు. మీరేమో మృతదేహాలను గంగా నదిలోకి విసిరేశారన్నారు. వీటిలో చాలా మృతదేహాలు పశ్చిమ బెంగాల్‌కు కొట్టుకొచ్చాయని, వాటికి తాము గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించామని చెప్పారు. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి మీ దగ్గర కట్టెలు లేవా? అని ప్రశ్నించారు.


బీజేపీ మంగళవారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ, ఇది మేనిఫెస్టోయా? మనీఫెస్టోయా? ఎవరికి తెలుసునన్నారు. లఖింపూర్ ఖేరీ హింసాకాండపై బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘మీకేమైనా సిగ్గుందా? రైతులు నిరసన తెలుపుతున్నారు. మీ మంత్రి కొడుకు రైతులపై నుంచి వాహనాలను నడిపారు. కనీసం క్షమాపణ కోరండి’’ అని డిమాండ్ చేశారు. 


బీజేపీ పరిస్థితి బాగులేదు : అఖిలేశ్ యాదవ్

వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిజ్నూరులో ఎన్నికల ప్రచారం రద్దయిన విషయాన్ని అఖిలేశ్ యాదవ్ ప్రస్తావిస్తూ, బీజేపీకి వాతావరణం బాగులేదన్నారు. బీజేపీ విమానం ఇక ఉత్తర ప్రదేశ్‌లో దిగబోదని చెప్పారు. 


ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో 2021 అక్టోబరు 3న రైతులు నిరసన తెలుపుతుండగా, వారిపై నుంచి కారు దూసుకెళ్ళడంతో ఎనిమిది మంది మరణించారు. వీరిలో నలుగురు రైతులు, అజయ్ మిశ్రా కారు డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఈ కేసులో ఓ నిందితుడు. 


Updated Date - 2022-02-08T21:06:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising