Delhiలో రెండు అగ్నిప్రమాదాలు
ABN, First Publish Date - 2022-04-09T17:14:44+05:30
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో శనివారం ఉదయం ఆజాద్ మార్కెట్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి....
ఆరుగురు అగ్నిమాపక సిబ్బందికి గాయాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో శనివారం ఉదయం ఆజాద్ మార్కెట్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మూడు భవనాల్లోని ఐదు దుకాణాలు దగ్ధమైనట్లు ఢిల్లీ అగ్నిమాపకశాఖ అధికారులు చెప్పారు. 20 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రాజిందర్ అత్వాల్ తెలిపారు.మరోవైపు ఆనంద్ పర్వత్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫ్యాక్టరీలో మరోసారి మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం బీఎల్ కపూర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో 10 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది.
Updated Date - 2022-04-09T17:14:44+05:30 IST