ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేజ్రీవాల్ ప్రతిపాదనను తిరస్కరించిన ఎల్జీ

ABN, First Publish Date - 2022-01-21T20:04:01+05:30

వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేసి, కోవిడ్ ఆంక్షలను సడలించాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేసి, కోవిడ్ ఆంక్షలను సడలించాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ శుక్రవారంనాడు తోసిపుచ్చారు. అయితే, 50 శాతం సామర్థ్యంతో ప్రైవేటు ఆఫీసులు తిరిగి పనిచేసేందుకు గవర్నర్ సమ్మతి తెలిపారు.


''ప్రైవేటు కాలేజీలు 50 శాతం సామర్థ్యంలో తిరిగి పనిచేసేందుకు అంగీకరిస్తున్నాను. కానీ, కోవిడ్ పరిస్థితులు మెరుగయ్యేంత వరకూ వీకెండ్ కర్ఫ్యూలు, మార్కెట్లు తెరవడంపై తీసుకున్న నిర్ణయం యథాతథంగా కొనసాగించాలని సూచిస్తున్నాను'' అని ఎల్జీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. దీనికి ముందు ఢిల్లీ ప్రభుత్వం కోవిడ్ కేసులు తగ్గుతున్నందున ఆంక్షలు సడలించాలని కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకు ఎల్‌జీ అనుమతి కోరింది. కాగా, ఢిల్లీలో గురువారం 12,306 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, 43 మంది మృత్యువాత పడ్డారు. పాజిటివిటీ రేటు 21.48కి తగ్గింది.

Updated Date - 2022-01-21T20:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising