ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mysore: 7న మైసూరుకు గజరాజులు

ABN, First Publish Date - 2022-08-06T17:27:24+05:30

దసరా ఉత్సవాల కోసం మైసూరుకు గజరాజులు రా నున్నాయి. ఈ ఏడాది మైసూరు దసరా ఉత్సవాలు(Dussehra celebrations) ఆడంబరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాల కోసం మైసూరుకు గజరాజులు రా నున్నాయి. ఈ ఏడాది మైసూరు దసరా ఉత్సవాలు(Dussehra celebrations) ఆడంబరంగా జరపాలని ప్రభుత్వం తీర్మానించింది. మత్తెగోడు, దుబారె(Mattegodu, Dubare) శిబిరాల నుంచి ఐదు గజరాజులను ఎంపిక చేశారు. వీటిలో మత్తిగోడు నుంచి 63 ఏళ్ల అర్జున, 57 ఏళ్ల అభిమన్యు, 39 ఏళ్ల గోపాలస్వామి, 38 ఏళ్ల మహేంద్ర, 22 ఏళ్ల భీమ, దుబారె శిబిరం నుంచి 44 ఏళ్ల ధనంజయ, 45 ఏళ్ల కావేరి, 40 ఏళ్ల గోపి, 41 ఏళ్ల శ్రీరామ, 63 ఏళ్ల విజయతోపాటు రామపుర అభయారణ్య శిబిరం నుంచి 49 ఏళ్ల చైత్ర, 21 ఏళ్ల లక్ష్మి, 18 ఏళ్ల పార్థసారథి(Parthasarathy)లను ఎంపిక చేశారు. 14 ఏనుగులను ఎంపిక చేశారు. సుదీర్ఘకాలంపాటు అంబారిని మోసిన అర్జున ప్రత్యేకంగా రానుంది. ఈ ఏడాది కూడా అభిమన్యు గజరాజు(Abhimanyu Gajaraju) అంబారి మోయనుంది. ఈనెల 7న గజరాజుల రాక ప్రారంభం కానుంది. నాగరహొళె జాతీయ ఉద్యానవన పరిధిలోని వీరనహసళ్లి మెయిన్‌గేట్‌ వద్ద గజరాజులను స్వాగతించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. ప్రస్తుతానికి ఏనుగుల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. విడతలవారిగా మైసూరు ప్యాలెస్‏కు గజరాజులు చేరుకోనున్నాయి.

Updated Date - 2022-08-06T17:27:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising