Covidతో ఒకేరోజు 29 మంది మృతి
ABN, First Publish Date - 2022-01-21T16:40:43+05:30
కొవిడ్ థర్డ్వేవ్ ఉధృతి కొనసాగుతోంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 47,754 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా ఈ అవధిలో అత్యధికంగా 29 మంది మృతిచెందడం కలకలం రేపుతోంది. 22,143 మంది కోలుకున్నారు.
- థర్డ్వేవ్లో ఇదే అత్యధికం
- కలకలం రేపుతున్న కరోనా మరణాలు
- Bengaluruలో 30 వేలమందికి పాజిటివ్
బెంగళూరు: కొవిడ్ థర్డ్వేవ్ ఉధృతి కొనసాగుతోంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 47,754 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా ఈ అవధిలో అత్యధికంగా 29 మంది మృతిచెందడం కలకలం రేపుతోంది. 22,143 మంది కోలుకున్నారు. బెంగళూరులో 30,540 మందికి, హాసన్లో 1840, తుమకూరులో 1622, మండ్యలో 1512, మైసూరులో 1352, బెంగళూరు గ్రామీణలో 974, దక్షిణకన్నడలో 974, బళ్ళారిలో 952 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇతర జిల్లాల్లోనూ వందల్లో కేసులు నమోదయ్యాయి. యాదగిరిలో 80, బాగల్కోటెలో 66 మందికి పాజిటివ్ ప్రబలింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా 29 మంది మృతి చెందగా వీరిలో బెంగళూరులో 8మంది, కలబుర్గి, మైసూరులలో 5మంది చొప్పున, బీదర్, శివమొగ్గలో ఇద్దరు చొప్పున, ఏడు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. 30 జిల్లాల్లోనూ 2,93,231 మంది చికిత్స పొందుతున్నారు.
Updated Date - 2022-01-21T16:40:43+05:30 IST