ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మదురైలో విషాదం

ABN, First Publish Date - 2022-01-10T16:13:17+05:30

మదురైలో కరోనా మహమ్మారికి భయ పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి ఆత్మహత్యా యత్నా నికి పాల్పడగా ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర అసస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా భయంతో ఆత్మహత్యాయత్నం

తల్లీకొడుకుల మృతి

చెన్నై: మదురైలో కరోనా మహమ్మారికి భయ పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి ఆత్మహత్యా యత్నా నికి పాల్పడగా ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర అసస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మదురై కల్‌మేడు ఎంజీఆర్‌ నగర్‌లో నాగరాజన్‌, లక్ష్మీ (46) అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి అనితా, జ్యోతిక (23) అనే కుమార్తెలు శిబిరాజ్‌ (13) అనే కుమారుడు ఉన్నారు. కొన్ని నెలల క్రితం అనితా ఆకస్మికంగా మృతి చెందగా. జ్యోతికకు వివాహమై భర్తతో ఉంటోంది. ఈ నేపథ్యంలో నాగరాజన్‌ హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురికావటంతో తల్లిదండ్రుల సేవ చేసేందుకు జ్యోతిక తన మూడేళ్ల కుమారుడు రితీష్‌తో పుట్టింటికి వచ్చింది. కొద్ది రోజులకు నాగరాజన్‌ మృతి చెందాడు. నెలల తేడాలో కుమార్తెను, భర్తను పోగొ ట్టుకుని శోకంతో లక్ష్మి క్రుంగిపోయింది. ఈ నేపథ్యంలో జ్యోతికకు జలుబు, దగ్గు అధికమై ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించగా ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ సంగతి తెలిసి లక్ష్మి మరింత దిగులు చెంది ఇంటిలో ఒకరికి కరోనా సోకింతే అందరికీ వ్యాపిస్తుందని భయపడింది. జ్యోతిక కూడా మరింత క్రుంగిపోయి కరోనాతో ఇబ్బంది పడటం కంటే చావటం మేలనుకుంది.


ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. దానికి ఆమెకూడా అంగీ కరించింది. ఆ మేరకు శనివారం రాత్రి లక్ష్మి, కుమార్తె జ్యోతిక, ఆమె కుమారుడు రితీష్‌, తమ్ముడు శిబిరాజ్‌ విషం తాగి పడుకున్నారు. ఆదివారం ఉదయం లక్ష్మి ఇంటి తలుపులు చాలసేపటిదాకా తెరవకపోవటంతో చుట్టు పక్కలవారు తలుపుతట్టారు. లోపల గడియపెట్టి ఉండటం, ఎలాంటి అలికిడి లేకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్ళి చూడగా జ్యోతిక, ఆమె మూడేళ్ల కుమారుడు రితీష్‌ శవాలుగా పడి ఉండటం చూసి దిగ్ర్భాంతి చెందారు. వారి మృతదేహాల పక్కనే కొన్న ఊపిరితో ఉన్న లక్ష్మిని, ఆమె కుమారుడు శిబిరాజ్‌ను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి సిలైమాన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - 2022-01-10T16:13:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising